CPI నాయకుల ఆధ్వర్యంలో పాదయాత్ర కరపత్రాల ఆవిష్కరణ
ATP: గుత్తిలో CPI నాయకులు ఈనెల 10వ తేదీ నుంచి చేసే పాదయాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. CPI జిల్లా కార్యవర్గ సభ్యులు వీరభద్రస్వామి మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాదిరిగా ఏపీ రాష్ట్రానికి ఉపాధి హామీ నిధులు 90 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతపురం నుంచి బండ్లపల్లి వరకు జరిగే పాదయాత్రను విజయవంతం చేయాలన్నారు.