మణుగూరులో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు
భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం మణుగూరులో పలు ప్రభుత్వ సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆశ్రమ గిరిజన పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను కూడా తనిఖీ చేసారు.