యాదాద్రిలో ఏకాదశి లక్ష పుష్పార్చన ఉత్సవం

యాదాద్రిలో ఏకాదశి లక్ష పుష్పార్చన ఉత్సవం

BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో సోమవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్ష పుష్పార్చన శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. అర్చక బృందం, వేద పండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధ పూలతో పూజలు చేశారు. పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం రెండు గంటలపాటు కొనసాగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.