'రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం ఆగదు'
GDWL: 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడానికి సన్నద్ధం కావాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఐజ మండల MROకు సోమవారం వినతిపత్రం వారు సమర్పించారు. ఇచ్చినట్టే ఇచ్చి రిజర్వేషన్ను యధాస్థితికి తీసుకురావాలని కుట్రలు పన్నుతున్నారని, ఈ కుట్రలను భగ్నం చేసి పోరాడి రిజర్వేషన్ సాధించుకోవాలని పిలుపునిచ్చారు.