'రహదారి ప్రమాదాల నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టండి'

కర్నూలు: రహదారి ప్రమాదాల నివారణ కోసం సత్వర చర్యలు తీసుకోవాలని నంద్యాల జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారుల భద్రత సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో నంద్యాల ఎఎస్పీ మంద జవాలి అల్ఫోన్స్, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.