వెంగళరావునగర్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం
నెల్లూరు రూరల్ 33వ డివిజన్ వెంగళరావునగర్లో పింఛన్ల పంపిణీ బుధవారం మొదలైంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి నగదు అందజేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.4వేలు పింఛన్ అమలు చేసిన మంచి ప్రభుత్వం తమదని ఆయన పేర్కొన్నారు.