అమలాపురంలో ఐసెట్కు సర్వం సిద్ధం

కోనసీమ: MBA, MCA ప్రవేశాల కోసం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే 'ఏపీ ఐసెట్'కు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు రెండు సెషన్స్లో ఈ పరీక్ష జరగనుంది. కోనసీమ జిల్లాలో 800 మంది విద్యార్ధులు ఈ పరీక్షకు హాజరవుతారు. ఈ పరీక్షకు శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో BVC ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీలో ఏర్పాటు చేశారు.