VIDEO: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.15,300, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు రూ.8,000, కొత్త మిర్చి రూ.16,344 పత్తి ధర రూ.7,000 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి ధర రూ.100 తగ్గగా.. కొత్త మిర్చి రూ.333, పత్తి ధర రూ.50 పెరిగినట్లు పేర్కొన్నారు.