సెమీస్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ ఓటమి

సెమీస్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ ఓటమి

భారత స్టార్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీ ఫైనన్లో ఓటమి పాలైంది. వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీ పురుషుల డబుల్స్‌లో ఈ జంట 21-19,10-21,18-21తో ఆరోన్ చియా-సోహ్ యిక్(మలేషియా) ద్వయం చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఈ ఏడాది సాత్విక్- చిరాగ్ జోడీకి ఇది మూడో సెమీఫైనల్ ఓటమి.