BIG BREAKING: రాష్ట్రంలో కరోనా కేసు

AP: రాష్ట్రంలో కరోనా కేసు నమోదైంది. విశాఖ మద్దెలపాలెంకు చెందిన ఓ వివాహితకు కొవిడ్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆమె భర్తతో పాటు పిల్లలకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వైరస్ పట్ల అప్రమత్తం ఉండాలని, మాస్కులు ధరించాలని పేర్కొన్నారు.