నేడు జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం

నేడు జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం

MBNR: మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉ.8 గంటల నుంచి కార్యక్రమం మొదలవుతుందని దేవరకద్ర నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇన్ ఛార్జ్ ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. దేవరకద్ర నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.