వార్డు సభ్యులకు పరిపాలనపై అవగాహన సదస్సు
MBNR: జడ్చర్ల ఎంపీపీ కార్యాలయంలో నూతన వార్డు సభ్యులకు ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ఎంపీడీవో విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నసురుల్లాబాద్, కిష్టారం గ్రామ సభ్యులకు గ్రామ పరిపాలన, చట్టాలు, ప్రభుత్వ పథకాలు, గ్రామసభల నిర్వహణపై అవగాహన కల్పించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో వార్డు సభ్యుల బాధ్యతలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు.