నాటువైద్యం వికటించి ఒకరు మృతి

నాటువైద్యం వికటించి ఒకరు మృతి

NGKL: జిల్లాలో విషాద ఘటన జరిగింది. బిజినేపల్లి మండలం ఖానాపూర్‌లో నాటు వైద్యుడు నిరంజన్, భార్య చాన్బి (65), కూతురు షమీనా నాటు వైద్యం చేసేందుకు మందును తయారు చేస్తుండగా శుక్రవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. గమనించిన మిగతా కుటుంబీకులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా చాన్బి మృతి చెందింది. నిరంజన్, షమీనా చికిత్సలో ఉన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.