ప్రారంభమైన మూడో విడత పోలింగ్
GDWL: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉండవెల్లి, మనోపాడు, అలంపూర్, కోహెడ, యెర్రపల్లి, ఇటిక్యాల మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. గంట విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.