మలక్పేట్లో రూ.1.44 లక్షలు స్వాధీనం

HYD: మలక్పేట్ ఠాణా పరిధి దిల్షుఖ్నగర్ రాజీవ్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పాయింట్ వద్ద ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఆదివారం రూ.1.44 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా తీసుకెళ్తుండటంతో స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అప్పగించినట్లు ఎస్సై సీహెచ్.సురేశ్ తెలిపారు.