పలు అభివృద్థి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

పలు అభివృద్థి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

MHBD: తొర్రూరు (M) కంఠాయపాలెంలో ఇవాళ PMGSY పథకం కింద విడుదలైన నిధులతో వంతెన నిర్మాణాలకు MP కడియం కావ్యతో కలిసి MLA యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రూ. 9.7 కోట్లతో నిర్మించే ఈ వంతెనలతో వర్షాకాల సమయంలో గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు శాశ్వతంగా పరిష్కారం అవుతాయన్నారు.