ఎండ తీవ్రతతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: MLA
BHPL: అధిక ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రత పెరుగుతున్న కారణంగా వడగాలుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని MLA గండ్ర సత్యనారాయణ సూచించారు. ఎండ వేడిమి ఉండే సమయాల్లో వీలైనంతవరకు బయటకు రాకుండా ఉండాలని, తప్పనిసరి పరిస్థితిల్లో బయటకు వచ్చే పక్షంలో జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. ఉ.10 గంటల నుంచి సా.4 వరకు వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు జాగ్రత్తగా ఉండాలన్నారు.