రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
విశాఖ జిల్లా భీమిలి(మం) తాళ్లవలస విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ఈ కారణంగా తాళ్లవలస, రాయినిపేట, ఎరుసుపేట, ఒనుముపేట, మహిత లేఅవుట్, లెజెండ్ లేఅవుట్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.