గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
విశాఖపట్నంలో జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పోలీస్ పరేడ్ మైదానంలో వేడుకలకు అవసరమైన బందోబస్తు, అలంకరణ, సీటింగ్, శానిటేషన్, తాగునీటి ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని సూచించారు.