హెల్మెట్లు పంపిణీ చేసిన డీఎస్పీ
సత్యసాయి: ఓబులదేవరచెరువులో పోలీసులు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేస్తూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.