గంజాయి డ్రగ్స్ రవాణాపై ప్రత్యేక దృష్టి: సీఐ
BDK: 'ప్రజా చైతన్యం డ్రగ్స్పై యుద్ధం' కార్యక్రమంలో భాగంగా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు సీఐ నాగరాజు నాకాబందీ నిర్వహించారు. ఆర్డీవో చెక్పోస్ట్ ఏజీ కాలేజ్ భద్రాచలం రోడ్ల వద్ద మూడు బృందాలుగా వాహన తనిఖీలు చేశారు. గంజాయి వంటి డ్రగ్స్ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.