కదులుతున్న ఎవరెస్ట్

ప్రపంచంలో ఎతైన శిఖరాల్లో ఒకటి ఎవరెస్ట్. ఈ శిఖరాన్ని ఏటా వందల మంది పర్వాతారోహకులు అధిగమిస్తారు. అయితే ఈ శిఖరం నెమ్మదిగా కదులుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భారత్ ఏడాదికి 5 సెం.మీ చొప్పున యూరేసియా వైపు వెళ్తున్నట్లు GPS డేటా ద్వారా గుర్తించారు. దీంతో ఎవరెస్ట్ కొన్ని మి.మీ చొప్పున ఈశాన్య దిశగా కదులుతున్నట్లు తెలిపారు. ఈ కదలిక ఇప్పటిలో ఆగిపోయేలా కనిపించటం లేదన్నారు.