అంతర్రాష్ట్ర దొంగల గ్యాంగ్ అరెస్టు
సత్యసాయి: జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల గ్యాంగ్ను అరెస్టు చేశారు. వేణుగోపాల్ రెడ్డి, చిన్నం ఆదెమ్మ, ఓ మైనర్ బాలుడు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 10½ తులాల బంగారు నగలు, 1250 గ్రాముల వెండి, 4 సెల్ఫోన్లు, కారు, బైక్, పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రశాంతినిలయం రైల్వే స్టేషన్ వద్ద నిందితులను పోలీసులు పట్టుకున్నారు.