దొంగతానానికి వెళ్లి షాక్తో మృతి
VZM: సంతకవిటి మండలం గుళ్ల సీతారామపురం సమీప మామిడితోటలో సోమరాజుపేటకు చెందిన భాస్కరరావు మృతి చెందిన ఘటనపై పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈనెల 19న వేకువజామున తోటలో నిరుపయోగంగా ఉన్న మూడు విద్యుత్ స్థంభాల తీగలను దొంగిలించిన అతడు, పక్కనే విద్యుత్ సరఫరా ఉన్న వైర్లు కత్తిరించే సమయంలో షాక్కు గురై మృతి చెందినట్లు ఎస్ఐ గోపాలరావు తెలిపారు.