సీఎం చంద్రబాబుతో బీజేపీ చీఫ్ భేటీ
VSP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కలిశారు. విశాఖకు చెందిన మాధవ్.. నగర సమస్యలతో పాటు హోం గార్డుల బదిలీలు, వృద్ధులకు ఆరోగ్య కార్డుల వినియోగంపై సమస్యలను ప్రస్తావిస్తూ వినతిపత్రం అందజేశారు. సమస్యలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.