హోలగుందలో నీటి సమస్య.. గ్రామస్థుల ఆందోళన

హోలగుందలో నీటి సమస్య.. గ్రామస్థుల ఆందోళన

KRNL: హోళగుంద మండలం 8వ వార్డులో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. 20 రోజులుగా సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్థులు సోమవారం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఎంపీడీవో విజయలలితను కలిసి తమ సమస్యలు వివరించారు. వస్తున్న నీరు కూడా మురికిగా ఉండటంతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే స్వచ్ఛమైన నీరు అందించాలని డిమాండ్ చేశారు.