‘రైతులు ఆనందంగా ఉంటే సమాజం బాగుంటుంది’

‘రైతులు ఆనందంగా ఉంటే సమాజం బాగుంటుంది’

NTR: విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఎమ్మెల్యే బోండా ఉమా నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆనందంగా ఉంటే సమాజమంతా సుఖసంతోషాలతో ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వం రైతుబంధు సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, వైసీపీకు కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శించారు.