సేంద్రీయ ఎరువులతో పంటలు పండించాలి: ఏఈవో
KNR: సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు సమృద్ధిగా పండుతాయని ఏఈవో వెంకటేష్ రైతులతో అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లోని రైతు వేదికలో ప్రకృతి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి పాల్గొన్నారు.