నేటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన
TPT: పంచాయతీ పాలకవర్గాల గడువు నేటితో ముగిసింది. రేపటి నుంచి తిరుపతి జిల్లాలో ప్రత్యేకాధికారుల పాలన సాగనుంది. జిల్లాలో 811 పంచాయతీలు ఉండగా, 29 గ్రామ పంచాయతీలకు 2020న సాధారణ ఎన్నికల జరగకపోవడంతో ప్రత్యేకాధికారులు ఉన్నారు. మిగిలిన 782 గ్రామ పంచాయితీలకు 271 మంది అధికారులను ఇప్పటికే కలెక్టర్ నియమించారు.