నేడు మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్న ఎమ్మెల్యే

నేడు మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్న ఎమ్మెల్యే

MBNR: మహబూబ్‌నగర్ శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి ఆదివారం మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. ఆయన ముందుగా ఉదయం 11 గంటలకు పట్టణంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 11:30 గంటలకు హెచ్ఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో మెగా హెల్త్ క్యాంపులో పాల్గొననున్నారు. అనంతరం హన్వాడ మండలంలో నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొంటారు.