రెండో విడత పోలింగ్ ప్రారంభం
KMR: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. లింగంపేట, నాగిరెడ్డి పేట, గాంధరి, ఎల్లారెడ్డి, మొహమ్మద్ నగర్, నిజాంసాగర్, పిట్లం మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్కు అవకాశం ఉంది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.