మాచర్లలో రథోత్సవాన్ని ప్రారంభించిన ఎంపీ
PLD: శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన రథోత్సవ కార్యక్రమాన్ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించారు. ఆలయానికి చేరుకున్న ఎంపీ, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిలకు ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం వారికి వేద ఆశీర్వచనాలు అందించి సత్కరించారు.