శ్రీకాకుళం మీదుగా ప్రత్యేక రైళ్లు

శ్రీకాకుళం మీదుగా ప్రత్యేక రైళ్లు

SKLM: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఈ సందర్భంగా చర్లపల్లి-సంత్రగచి (నం.07517/18) మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైలు ఈ నెల 16, 23, 30వ తేదీల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ రైలు జిల్లాలో శ్రీకాకుళం రోడ్డు, పలాస వంటి రైల్వే స్టేషన్లలో ఆగుతాయని పేర్కొంది.