రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి

రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి

అన్నమయ్య: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లిలోని ఎర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మరణించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలవ్వగా.. ఆసుపత్రికి తరలించారు. పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్‌కు  వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.