ఫిర్యాదులపై స్పందించిన ఛైర్మన్
WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో విలీన గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజలు చేసిన ఫిర్యాదులకు మున్సిపల్ ఛైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ స్పందించారు. శుక్రవారం ఆయన 11వ వార్డులో డంపింగ్ యార్డ్, బతుకమ్మ ఆట స్థలం, పల్లె దవాఖాన, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలను పరిశీలించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.