'వసతి గృహాల్లో విద్యార్థినులకు ఇబ్బంది లేకుండా చూడాలి'
BHNG: బాలికల వసతి గృహాల్లో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవిలత వసతి గృహాల ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం బీబీనగర్లోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, బీసీ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.