'ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి'

కర్నూలు: పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జీదారులను సంతృప్తి పరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం - పీజీఆర్ఎస్లో ఆయన పాల్గొన్నారు. డివిజన్లోని ఆయా మండలాల ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.