ఇరాన్ సుప్రీం లీడర్తో పాక్ ప్రధాని భేటీ

టెహ్రాన్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీతో పాక్ ప్రధాని షరీఫ్ సమావేశమయ్యారు. ఈ భేటీలో పాక్ సైన్యాధ్యక్షుడు అసీమ్ మునీర్ సైతం హజరయ్యారు. దక్షిణాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ శాంతి కోసం చేస్తున్న మధ్యవర్తిత్వాన్ని పాక్ ప్రధాని ప్రశంసించారు. ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రాంతీయ స్థిరత్వం, ద్వైపాక్షిక చర్చలు ఇరువురు నేతలు చర్చించారు.