సివిల్స్ టాప్ ర్యాంకర్ స్టోరీ ఇదే..!

సివిల్స్ టాప్ ర్యాంకర్ స్టోరీ ఇదే..!

ఇవాళ విడుదలైన సివిల్స్ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన అనూజ్ అగ్నిహోత్రి మొదటి ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. ఇతడు జోధ్‌పుర్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 2023లో యూనియన్ టెరిటరీస్ సివిల్ సర్వీసెస్ సాధించాడు. ప్రస్తుతం ఢిల్లీలో ఎస్‌డీఎంగా ప్రొబేషన్‌లో ఉన్నాడు. మూడో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు సాధించినట్లు తెలిపాడు.