జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కోదాడ ఎమ్మెల్యే ప్రచారం
SRPT: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి శుక్రవారం జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. తమ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపెడతారని ఓటర్లకు వివరించారు.