పంజాబ్ తలవంచదు: కేజ్రీవాల్
కేంద్రంపై ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. పంజాబ్ గుర్తింపుపై కేంద్రం దాడి చేస్తోందని మండిపడ్డారు. నియంతృత్వం ఎదుట పంజాబ్ ఏనాడు తలవంచలేదని చరిత్ర చెబుతోందని పేర్కొన్నారు. చండీగఢ్ పంజాబ్కు చెందినదే అని.. దాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.