ప్రభుత్వ ఆసుపత్రిలో బిల్లుల జాప్యంపై ఆవేదన

ప్రభుత్వ ఆసుపత్రిలో బిల్లుల జాప్యంపై ఆవేదన

WGL: వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కార్యాలయం ఆలస్యంగా తెరుచుకుంటోందని, బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతోందని సిబ్బంది శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం రిటైర్ అయిన జూనియర్ అసిస్టెంట్‌కు సంబంధించిన బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.