తాడిమర్రి, బత్తలపల్లి సాగునీటిపై కీలక చర్యలు
సత్యసాయి: తాడిమర్రి, బత్తలపల్లి మండలాల సాగునీటి సమస్య పరిష్కారం దిశగా అధికారులు కదిలారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో బీజేపీ నేత హరీష్ బాబు అధికారులతో కలిసి హంద్రీనీవా కాలువను పరిశీలించారు. ఈ నీటిని పీఏబీఆర్లోకి మళ్లించే సాంకేతిక అంశాలపై అధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని హరీష్ తెలిపారు.