మెగా రక్తదాన శిబిర పోస్టర్ ఆవిష్కరించిన ఎస్పీ
BDK: ఈ నెల 9 ఆదివారం కొత్తగూడెం సింగరేణి హై స్కూల్లో జరిగే రక్తదాన శిబిరంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేయాలని ఎస్పీ రోహిత్ రాజు కోరారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండేషన్ వారి మెగా రక్తదాన శిబిర పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజ సేవ చేయడం ఓ ప్యాషన్గా అలవాటు చేసుకోవాలని సూచించారు.