విఘేశ్వరుని ఒక్కరోజు ఆదాయం ఎంతంటే?
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,77,101 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 164 మంది స్వామివారిని దర్శించుకున్నారన్నారు. 18 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించామన్నారు. 2670 మంది అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.