42వ వార్డులో పర్యటించిన మంత్రి టీజీ భరత్
కర్నూలు: రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నామని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులోని 42వ వార్డులో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.