పిల్లల మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు
KMR: జిల్లాలో సంచలనం రేపిన చిన్న పిల్లల మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఆర్బీ నగర్ కాలనీకి చెందిన ఇస్మాయిల్ తన ముగ్గురు పిల్లలు సీపాత్, ఆయాత్, మరియంలను చెరువులో తోసి హత్యచేశాడు. ఇస్మాయిల్ను పోలీసులు విచారించగా తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. అలాగే మిస్సైన మరో ఇద్దరి చిన్నారుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.