జవాన్‌పై దాడి.. టోల్ కంపెనీకు NHAI ఫైన్

జవాన్‌పై దాడి.. టోల్ కంపెనీకు NHAI ఫైన్

UPలో ఆర్మీ జవాన్‌పై టోల్ సిబ్బంది దాడి చేసిన ఘటనపై NHAI కఠిన చర్యలు తీసుకుంది. మీరట్‌లోని భూని టోల్‌గేట్ సిబ్బంది కపిల్‌పై దాడి చేశారు. ఈ చర్యపై స్పందించిన NHAI, మెస్సర్స్ ధరమ్ సింగ్ & కంపెనీపై రూ.20 లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా ఆ కంపెనీ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి, భవిష్యత్తులో టోల్ బిడ్డింగ్‌లో పాల్గొనకుండా చర్యలు చేపట్టింది.