భూ తగాదా.. ఒకరిపై ఒకరు దాడులు

భూ తగాదా.. ఒకరిపై ఒకరు దాడులు

VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని నస్కల్ గ్రామంలో భూ తగాదా విషయంలో దాయాదులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. సర్వే నంబర్ 216లో గల భూమిలో దారి విషయంలో గొడవకు దిగారు. దీంతో రెండు వర్గాలలో ఓ వర్గానికి చెందిన శ్రీనివాస్, దీపక్, వెంకటేశ్ తలలకు గాయాలయ్యాయి. మరో వర్గానికి స్వల్పంగా దెబ్బలు తగిలాయి. దాయాదులు ఇరువురు పరిగి PSలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.