అంధుల మహిళా క్రికెట్ జట్టును కలిసిన జైషా

అంధుల మహిళా క్రికెట్ జట్టును కలిసిన జైషా

అంధుల మహిళల T20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టును ఐసీసీ ఛైర్మన్ జైషా కలిశారు. ఈ సందర్భంగా ప్లేయర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం ప్లేయర్ల అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతీ క్రీడాకారిణి ఒక ఛాంపియన్ అని.. ఈ ఘనత రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని ఆయన తెలిపారు.